టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సినీ నిర్మాతను నియమించారు. టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా మోహన్ ముళ్ళపూడిని నియమిస్తూ ఉత్తర్వుల జారీ అయ్యాయి. ఈయన గతంలో పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కు గౌరవ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్నగర్లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధిలో, అలానే కరీంనగర్లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనుల్లో లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఈయన బాధ్యతలు నిర్వహిస్తారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్కు మోహన్ ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ని నియమిస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేసారు. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననుట్లు లేఖలో పేర్కొన్నారు. తన పై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మా రెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్కు అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa