పాలస్తీనాపై ఇజ్రాయిల్ అమానుష దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శులు దామా అంకయ్య, మూలం రమేష్ డిమాండ్ చేశారు. శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. 75 ఏళ్లుగా తమ ప్రాంతం కోసం, దేశం కోసం పోరాటం చేస్తున్న పాలస్తీనియన్లలను దాదాపు నెలరోజులుగా ఇజ్రాయిల్ వైమానిక, భూతల దాడులకు పాల్పడటం దారుణమన్నారు. నిరంతర బాంబుల దాడుల వల్ల 11వేల మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారన్నారు. అయితే సామ్రాజ్యవాద మీడియా టెర్రరిజానికి వ్యతిరేకంగానూ యూదులు, ముస్లింల మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేసి యుద్ధం అపాలని చెప్పినా మొండిగా అజ్రాయిల్ వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు సాగర్, లక్ష్మీరెడ్డి, మోహన్రావు, రాంబాబు, కత్తి శ్రీనివాసులు, నాగేశ్వరరావు, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నేతలు అరిగెల సాయి, సయ్యద్ సిరాజ్, షాన్వాజ్, రామరాజు, మున్నా, నాగేంద్ర పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa