పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో దోపిడీ ప్రయత్నం కలకలంరేపింది. బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న బండ బాబూరావు ఇంట్లోకి ముగ్గురు యువకులు చొరబడ్డారు. చోరీకి ప్రయత్నించటంతో యజమాని అడ్డుకున్నారు.. అతడిని బొమ్మ తుపాకీ, కత్తితో బెదిరిస్తూ ఇంట్లో దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. అయినా సరే బాబూరావు వెనక్కు తగ్గలేదు.. వారిని ప్రతిఘటించారు. దీంతో ఆ యువకులు కత్తితో గాయపరిచారు. అదే సమయంలో బాబూరావు భార్య గట్టిగా అరవడంతో.. చుట్టుపక్కల వారు రావడం చూసి దొంగలు పారిపోయారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఫర్నిచర్ తయారీ పని చేయడానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన ముగ్గురు యువకులు చోరీ చేయడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. వారితో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు గుర్తించామని తాడేపల్లిగూడెం డీఎస్పి శరత్ కుమార్ చెప్పారు. నలుగురిని అరెస్టు చేశామని.. మరొకరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.. గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa