పండగల సమయంలో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. రెండు, మూడు నెలల ముందే బుక్ చేసుకుంటే తప్ప టికెట్ దొరకడం చాలా కష్టం. ఇక రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు అయితే బయటివారు లోపలికి వెళ్లకుండా.. లోపలి వారు బయటికి రాకుండా రద్దీగా ఉంటాయి. అయితే ఓ వ్యక్తి ఏసీ టికెట్ కొనుగోలు చేసినా ఆ రైలులో ఉన్న రద్దీ కారణంగా ఎక్కలేకపోయాడు. దీంతో తన అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కాడు. ఈ సందర్బంగా రైల్వే శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ ప్రయాణికుడు.. తన దీపావళి పండగ సంతోషాన్ని నాశనం చేసినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీనికి తోడు తాను ముందుగా బుక్ చేసుకున్న టికెట్ డబ్బులు చెల్లించాలని భారతీయ రైల్వేను డిమాండ్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు తమకు జరిగిన అనుభవాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు.
గుజరాత్లోని వడోదరకు చెందిన 27 ఏళ్ల అన్షుల్ శర్మ.. తనకు రైలు ప్రయాణంలో ఎదురైన సంఘటనను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీపావళి సందర్బంగా తన సొంత ఊరుకు వెళ్లేందుకు రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాడు. థర్డ్ ఏసీ కోచ్లో బెర్త్ను రిజర్వేషన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు ఎక్కేందుకు స్టేషన్కు చేరుకున్నాడు. అయితే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కంపార్ట్మెంట్ మొత్తం నిండిపోయి డోర్ వద్ద కూడా వేలాడుతూ ఉన్నారు. అన్షుల్ శర్మ ఎక్కాల్సిన థర్డ్ ఏసీ కోచ్ కూడా మొత్తం నిండిపోయింది. దీంతో లోపలికి వెళ్లేందుకు అన్షుల్ శర్మ ఎంత ప్రయత్నించినా ఎక్కడానికి వీలు కాలేదు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న రైల్వే పోలీసులను సహాయం చేయాలని.. అన్షుల్ శర్మ కోరినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఆ రైలు వెళ్లిపోయింది.
ఈ ఘటనపై అన్షుల్ శర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను థర్డ్ ఏసీ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నానని.. అయినప్పటికీ అందులో ఉన్న రద్దీ కారణంగా తాను ఎక్కలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తన ఆవేదనను మొత్తం ట్విటర్ వేదికగా ప్రపంచానికి తెలియజేశాడు. నా దీపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు అంటూ రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలోనే తాను బుక్ చేసుకున్న థర్డ్ ఏసీ టికెట్ డబ్బులు రూ. 1173.95 తిరిగి ఇవ్వాలని భారతీయ రైల్వేను డిమాండ్ చేశాడు. ఈ పోస్ట్తోపాటే దీపావళి పండుగ సందర్భంగా ఆ రైలులో కిక్కిరిసిన ప్రయాణికుల ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పంచుకున్నాడు. ఈ పోస్ట్కు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa