రాష్ట్ర శాసనమండలి విప్ పాలవలస విక్రాంత్కు ప్రభుత్వం సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విప్ పర్యటనలో ఆయా జిల్లాల అధికారులు ప్రొటోకాల్ పాటించాలని ఆదేశించారు. నెల క్రితమే ఆయనను విప్గా నియమించిన సంగతి తెలిసిందే. తనకు తొలుత ఎమ్మెల్సీగా గుర్తించి, ఆ తర్వాత శాసన మండలి ప్రభుత్వ విప్ హోదా కల్పించి.. ఇప్పుడు సహాయ మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విక్రాంత్ కృతజ్ఞతలు తెలిపారు. 2024లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వడమే లక్ష్యమన్నారు. విక్రాంత్కు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు.
పాలవసల విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఉణుకూరు నియోజక వర్గం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా , శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్మన్గా పని చేశారు. ఆ తర్వాత ఆ కుటుంబ నుంచి.. ఆయన సోదరి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి ఇందుమతి రేగిడి జెడ్పీటీసీగా.. భార్య గౌరీ పార్వతి పాలకొండ జెడ్పీటీసీగా ఉన్నారు. విక్రాంత్ 2014 ఎన్నికల్లో పాలకొండ, పాతపట్నం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుచుకుంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం విక్రాంత్ పనిచేవారు. తండ్రి పాలవలస రాజశేఖరం, తాత, నాన్నమ్మలు పాలవలస సంగంనాయుడు, రుక్మిణమ్మల నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కోసం పనిచేసిన విక్రాంత్కు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa