చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు.. కోర్టు అనుమతిస్తే బెయిల్ వస్తుంది. ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.అయన మాట్లాడుతూ.... వయసు ముఖ్యం కాదన్న వారు ఇప్పుడు ప్రాణాంతకం అంటున్నారు, చంద్రబాబుకి ఆనారోగ్యం రీత్యా తాత్కాలికంగా కోర్టు కండీషనల్ మెడికల్ బెయిల్ ఇచ్చింది. మరోవైపు ప్రధాన బెయిల్పై కూడా వాదనలు నడుస్తున్నాయి. మరింత కాలం ఆయన బయట ఉండటానికి వీలుగా ఒక మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్లు అర్ధం అవుతోంది. ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించడం వారి హక్కు. కోర్టు స్పెషలిస్టు వైద్యులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం సహజం. దానిలో తప్పు లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్య పరమైన సమస్యలతో ఉన్నప్పుడు కామెంట్ చేయడం కూడా సరికాదు. వాటిని నేను ఖచ్చితంగా పాటించే వ్యక్తిగానే మాట్లాడుతున్నాను. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే.. ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలా వ్యవహరిస్తూ...రిపోర్టులు మాత్రం వేరే విధంగా ఉంటే అనేక అనుమానాలు వస్తాయి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa