వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... సామాజిక సాధికార బస్సుయాత్ర ఎన్నికలు వస్తున్నాయనో...మరొకటనో చేయడం లేదు. ఆయా వర్గాలకు జగనన్న హయాంలో జరిగిన మంచిని చెప్పడం కర్తవ్యంగా భావించి చేస్తున్న యాత్ర ఇది. సమాజంలో అణగారిన కులాలు ఎదగాలని అంబేడ్కర్, ఫూలేల వంటి మహానుభావులు ఎంతో కృషి చేశారు.ఈ రాష్ట్ర చరిత్రలో సామాజిక న్యాయానికి తెరతీసింది నాడు వైఎస్సార్, నేడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డే.2014లో బీజేపీ, జనసేనలతో టీడీపీ కలిసింది. 624 హామీలిచ్చారు చంద్రబాబు. ఎన్నికలు అయిపోగానే వాటిని మరిచిపోయాడు. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలతో పాటు పేదలైన అందరినీ మోసం చేశాడు చంద్రబాబు.ఈరోజు గుండెమీద చేయివేసుకుని మేము బాగా బతుకుతున్నామనే పేదలు, ఎస్సీలు,ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎందరో కనిపిస్తారు. ఇందుకు కారణం జగనన్నే. ఆయన సంక్షేమ పథకాలే. సామాజిక న్యాయానికి నాంది పలికిన జగనన్నే మన నాయకుడు. సామాజిక సాధికారత విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న జగనన్నను, మనం ఎప్పటికీ మరిచిపోమని మళ్లీమళ్లీ చెబుదాం.సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మన ఎదుగుదలకు చేయూతనిచ్చిన జగన్మోహన్రెడ్డిని మనం మళ్లీ గెలిపించుకోవాలి. అది మనకోసమే అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa