శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 19వ తేదీన రైలు 07121/07122 సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు..సికింద్రాబాద్లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి 20 న రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాల్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
నర్సాపూర్-కొట్టాయం ప్రత్యేక రైలు 07119/07120 19న నర్సాపూర్లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి 20 న సాయంత్రం 4.50కు కొట్టాయంకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, సేలం, తిరుప్పూర్, కోయంబత్తూర్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది. అయ్యప్ప భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa