వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.... మీరందరు విజ్ఞులు, ఆలోచనపరులు. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న చేసిన కార్యక్రమాలను ఓ సారి సమీక్షించుకోమని కోరుతున్నాను. ఏ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డి అధికారంలో వచ్చారో గమనించండి. అంతకు ముందు బాబు పాలనలో అన్నీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఖజానా ఖాళీగా ఉంది. అన్నీ సమస్యలే. చంద్రబాబు అప్పులు వదిలి మరీ దిగిపోయారు. ఇక్కడ నూటికి 67మందికి వ్యవసాయమే ఆధారం. రాష్ర్టంలో 52లక్షల మంది రైతులున్నారు. 1.45 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే. మన తరఫున ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడుతుంది. వడ్డీలేని రుణాలు రైతులకు ఇచ్చిన రాష్ట్రం మనదే. అది జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో సంక్షేమపథకాల ద్వారా లబ్ది పొందని కుటుంబం ఒక్కటీ ఉండదు. సమర్ధవంతపాలన, మానవత్వం కలిగిన పాలన అందరం చూస్తున్నాం. ప్రతి క్షణం పేదలకు మంచి చేయాలని తపించే ప్రజానాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయనను అందరూ ఆశీర్వదించండి. జగన్మోహన్రెడ్డిని మనం వదులుకుంటే..మన సంక్షేమాన్ని మనమే కాళ్లతో తన్నుకున్నట్టు. బీసీలను జడ్జిలుగా నియమించకండి అన్న చంద్రబాబును నమ్మడమంటే..మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇలాంటి పనులు ఎన్నో చేశాడు చంద్రబాబు. ఆయన ద్వారా ఎవరికీ న్యాయం జరగదు. బాబులాంటి నేత అవసరమనుకుంటే...భగవంతుడు కూడా మనల్ని క్షమించడు అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa