Uber Cup 2026లో భారత మహిళల జట్టు ప్రయాణం ముగిసింది. గ్రూప్ ‘A’లో భాగంగా ఏప్రిల్ 27న చైనాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 0-5 తేడాతో ఘోర పరాజయం చవిచూసి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ పోరులో భారత షట్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయారు.స్టార్ షట్లర్ పీవీ సింధు, వాంగ్ జీయీ మధ్య జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. మొదటి గేమ్ను సింధు 16-21తో కోల్పోయింది. అయితే రెండో గేమ్లో అద్భుతంగా పుంజుకుని 21-19తో గెలిచి మ్యాచ్ను డిసైడర్కు తీసుకెళ్లింది. మూడో గేమ్లో ఒక దశలో 18-12 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివర్లో సింధు తడబడింది. వాంగ్ జీయీ వరుస పాయింట్లతో తిరిగి వచ్చి 21-19తో గేమ్ను గెలవడంతో భారత్కు తొలి షాక్ తగిలింది.సింధు ఓటమి తర్వాత భారత జట్టు వరుసగా వెనుకడుగు వేసింది. మొదటి డబుల్స్ మ్యాచ్లో ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా జంట చైనా జట్టుతో తలపడినా విజయం సాధించలేకపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ మ్యాచ్లో ఇషారాణి బారువా కూడా ఓటమిపాలవ్వడంతో చైనా 3-0 ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ను తమ వైపుకు తిప్పుకుంది. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమణ ఖరారైంది.మిగిలిన రెండు మ్యాచ్లు కేవలం లాంఛనప్రాయంగా మారాయి. రెండో డబుల్స్లో తనిషా క్రాస్టో, కావిప్రియ సెల్వం జంట గట్టి పోరాటం చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. చివరి సింగిల్స్లో దేవికా సిహాగ్ కూడా మూడు గేమ్ల పోరాటం తర్వాత పరాజయం పాలైంది. దీంతో భారత్ 0-5తో చైనాకు వైట్వాష్ అయింది.ఇక మహిళల జట్టు నిరాశపరిచినప్పటికీ, పురుషుల జట్టు మాత్రం థామస్ కప్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు చేరడం భారత బ్యాడ్మింటన్కు కొంత ఊరట ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa