ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న సంక్షేమపథకాల మంచిని తట్టుకోలేక టీడీపీ నాయకులు విమర్శలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 02:44 PM

వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ...బీసీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించారు జగనన్న. వారికోసం 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదే. సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీలోనే దక్కుతుంది అన్నది నిరూపణ అయింది. యువకుడైన మన జగనన్న ముఖ్యమంత్రిగా అణగారిన వర్గాల పాలిట ఇంటిదీపమై వెలుగులు పంచుతున్నారు. జగనన్న సంక్షేమపథకాల మంచిని తట్టుకోలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. నాకు అమెరికాలో ఒక యువకుడు కలిశాడు. మా నాన్న రిక్షా తొక్కేవాడు. వైఎస్సార్‌ పుణ్యమా అని ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్‌ చదివాను. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. లక్షల్లో జీతం తీసుకుంటున్నాను.  మా కుటుంబ స్థితిగతులు మారిపోయాయి అని ఆనందంగా చెప్పాడు. మహానేత వైఎస్సార్‌ తనయుడిగా జగనన్న ఇంగ్లీషుమీడియా చదువులు అందుబాటులోకి తెచ్చి..మన పిల్లలు ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్నారు అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa