జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన, ముఖ్య ఆలయాల దగ్గర వాటి ఆదాయ, వ్యయాలు తెలిపేందుకు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్ఐటిఎ) ఆధ్వర్యంలో.. ప్రధాన దేవాలయాల ట్రస్టు బోర్డు చైర్మన్లు, సభ్యులకు రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు సభ్యులు చేసిన మూడు సూచనలను పరిగణలోకి తీసుకున్న కమిషనర్.. వీటిలో కొన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆలయాలకు భారీ విరాళాలు ఇచ్చే దాతల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి.. వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా విధి విధానాలను అమలు చేయనున్నారు. డిస్ప్లే బోర్డులతో పాటు శ్రీఆదిశంకర జయంతి, శ్రీరామానుజ జయంతి, శ్రీవిఖనస జయంతి, శ్రీమధ్వాచార్య తదితర ప్రముఖ హైందవ మత గురువుల జయంతులను దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని చేసిన ప్రతిపాదనను అంగీకరించారు. ఆలయాలకు భూరి విరాళాలు ఇచ్చే దాతల కోసం ప్రత్యేకంగా డోనర్స్ సెల్ ఏర్పాటు చేసి, విధి విధానాలు రూపొందించి, అమలుచేయాలన్న ప్రతిపాదననూ సమ్మతించారు. ఈ మూడు ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు వీలుగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కమిషనర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa