తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఈ నెల 24న మళ్లీ ప్రారంభించనున్నారు. ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. అయితే తిరిగి అక్కడి నుంచే యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇదే సెంట్మెంట్తో లోకేశ్ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. అదే ఖరారైతే ఆయన పాదయాత్ర పది, 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసే నిమిత్తం ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోజనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఐడీ పోలీసులు చంద్రబాబుపై మోపిన కేసులకు సంబంధించి, సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు వెలువడ వచ్చని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒక వేళ తీర్పు మరికొద్ది రోజులు జాప్యమైనా లోకేశ్ పాదయాత్ర 24నే ప్రారంభం అవుతుందని, ఇందులో మార్పేమీ ఉండబోదని ముఖ్యనేత పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa