నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. తాజాగా గాంధీల కుటుంబానికి చెందిన రూ.752 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. గతంలో ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని సైతం పిలిపించి విచారించిన ఈడీ.. కొంతకాలంగా మౌనంగా ఉంటోంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల జప్తు సంచలనం రేపుతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014 లో కోర్టు ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి కాంగ్రెస్కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్.. యంగ్ ఇండియన్ సంస్ధలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు రూ.752 కోట్ల విలువైన ఆస్తులను తాజాగా జప్తు చేసింది. యంగ్ ఇండియా సంస్ధతో సహా ఏడుగురు నిందితులు ఈ కేసులో నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నిజాయితీ లేకుండా ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడ్డారని ఢిల్లీ కోర్టు గతంలో నిర్ధారించింది.
యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్-ఏజేఎల్కు చెందిన రూ. వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగిందని విచారణ తేలింది. న్యూస్ పేపర్లను ప్రింట్ చేసేందుకు తక్కువ ధరకు భూమిని పొందిన ఏజేఎల్ సంస్ధ.. 2008లో తన కార్యకలాపాలను నిలిపేసింది. అనంతరం వాణిజ్య ప్రయోజనాల కోసం ఆ ఆస్తులను వాడుకుందని ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఏజేఎల్ సంస్ధ రూ.90 కోట్లు అప్పు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆ అప్పు చెల్లించలేని పరిస్దితిలో ఏజేఎల్ సంస్థ ఉందని చూపించిన.. కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థను మరో కొత్త సంస్ధ యంగ్ ఇండియాలో విలీనం చేసింది. ఇందుకు గాను రూ. 50 లక్షలు కూడా చెల్లించింది. ఈ క్రమంలోనే ఏజేఎల్ వాటాదారుల్ని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు మోసం చేశారని కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ను యంగ్ ఇండియాకు ఇచ్చిన తర్వాత పాత రుణం చెల్లించాలని.. లేదా ఏజేఎల్ షేర్లు కేటాయించాలని కోరింది.
దీంతో ఏజేఎల్ సంస్ధ ఒక ఎమర్జెన్సీ భేటీ నిర్వహించి మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా రూ.90.21 కోట్ల విలువైన షేర్ల జారీకి తీర్మానం చేసింది. ఈ తాజా షేర్ల కేటాయింపుతో వెయ్యి కంటే ఎక్కువ మంది వాటాదారుల వాటా కేవలం 1 శాతానికి తగ్గించారు. అదే సమయంలో ఏజేఎల్ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అప్పుడే యంగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ కూడా తెచ్చుకుందని.. అందులో అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa