ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ని కలిసిన టీడీపీ బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 12:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అక్రమాలు జరిగాయని, అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎన్నికల అధికారులు తలొగ్గుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది. మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిష్ట్రేషన్‌ అధికారులు ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను అనుసరించడం లేదని టీడీపీ తెలిపింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, శాసన మండలిలో ప్రతిపక్ష నాయుకుడు యనమల రామకృష్ణుడు, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరావుతో కూడి న బృందం మంగళవారమిక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. బూత్‌ స్థాయి అధికారులుగా సచివాలయాల సిబ్బందిని తొలగించాలని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా పంపాలని కోరింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa