ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలు మెడికల్ కాలేజీ ఘటనపై స్పందించిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 12:49 PM

 ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన విద్యార్థుల దాడులపై టీడీపీ యువనేత  నారా లోకేష్  స్పందించారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడే బావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆసుపత్రిలో పేషెంట్లు అయ్యారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని, కర్నూలు, ఒంగోలు మెడికల్ కాలేజీలలో గంజాయి బ్యాచ్‌ల దాడులతో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. మత్తుకి బానిసైన కొంతమంది మెడికోల హింసాత్మక ప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసవ్వడం ‘యువగళం పాదయాత్ర’లో చూశానని ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa