ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైవేపై కూర్చున్న చిరుతపులి.. ట్రాఫిక్ జామ్

national |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 08:44 AM

ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి ట్రక్కు కింద పాగా వేసింది. అంతే మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా మీదుగా జాతీయ రహదారిపై వెళుతున్న ప్రయాణికులు చిరుతపులిని చూసి భయాందోళనలు చెందారు. చిరుతపులి అరగంట పాటు ట్రక్కు కింద నుంచి కదలక పోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చిరుతపులి ట్రక్కు కింద ఆశ్రయం పొందడాన్నివాహనాల డ్రైవర్లు చూసి అవాక్కయ్యారు. 


దాదాపు అరగంట తర్వాత చిరుతపులి సమీపంలోని పొలం వైపు వెళ్లింది. పరిస్థితిని గమనించిన అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుతపులి రాత్రి సమయంలో ట్రక్కు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకుందని, ఆ చిరుతకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. మొత్తం మీద చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవడంతో వాహనాల డ్రైవర్లు వణికిపోయారు. చిరుత పొలాల్లోకి పోయాక బతుకు జీవుడా అంటూ వాహనాల్లో గమ్యస్థానాల వైపు కదిలారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa