పంజాబ్ శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నరు భన్వారీలాల్ పురోహిత్కు సుప్రీంకోర్టు సూచించింది. గవర్నరు తన అధికారాలను సాధారణ చట్టాల ఆమోద ప్రక్రియను అడ్డుకోవడానికి వాడుకోరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు చట్టబద్ధత లేదని గవర్నరు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ నెల 10వ తీర్పు వెలువరించిన ధర్మాసనం.. అసెంబ్లీ సమావేశాలకు చట్టబద్ధత కల్పించాలని స్పష్టం చేసింది. మొత్తం 27 పేజీల ఈ తీర్పు కాపీని గురువారం రాత్రి సుప్రీంకోర్టు తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నరుకు కొన్ని అధికారాలుంటాయని, అయితే అవి చట్టబద్ధ ప్రక్రియను అడ్డుకోవడానికి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిల్లును నిరవధికంగా పెండింగ్లో ఉంచే స్వేచ్ఛ గవర్నర్కు ఉండదు.. నిర్ణయం తీసుకోవడంలో విఫలమవడం, సక్రమంగా ఆమోదించిన బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచడం అనేది ఆ వ్యక్తీకరణకు విరుద్ధంగా చర్య తీసుకోవలసి ఉంటుంది.. ఎన్నుకోబడని ప్రభుత్వాధినేతగా కొన్ని రాజ్యాంగ అధికారాలను గవర్నర్కు అప్పగించారు. అయితే, ఈ అధికారాలను రాష్ట్ర శాసనసభల సాధారణ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉపయోగించలేం’ అని ధర్మాసనం పేర్కొంది.
‘ప్రజాస్వామ్యం పార్లమెంటరీ రూపంలో నిజమైన అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల వద్ద ఉంటుంది.. గవర్నర్, రాష్ట్రపతిచే నియమించిన వ్యక్తి, నామమాత్రపు దేశాధినేతగా వ్యవహరిస్తారు.. ఈ సూత్రం రాజ్యాంగ పునాదిని సుస్థిరం చేస్తుంది.. రాష్ట్ర పాలన లేదా దేశం పాలనను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రాథమికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంటుంది.. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన రాజనీతిజ్ఞుడిగా, రాజ్యాంగ సంబంధిత విషయాలపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa