ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి ఎన్టీఆర్ఎఫ్ దళాలు ట్రయల్ రన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా 800 MM పైపు గుండా చక్రాలు ఉన్న స్ట్రెచర్ను లోపలికి పంపి.. అవతలి వైపు ఉన్న కార్మికులు దానిపై బోర్లా పడుకున్న తర్వాత బయటకు లాగుతారు. అనంతరం బాధితులను నేరుగా ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీఆర్ఎఫ్ విడుదల చేసింది.
ఆ వీడియో ఎన్డీఆర్ఎఫ్ అధికారిని తాడుతో కట్టిన చక్రాల స్ట్రెచర్ ద్వారా సొరంగంలోకి పైపులో గుండా పంపడం.. అనంతరం స్ట్రెచ్ పూర్తి చేసిన తర్వాత వెనక్కి లాగడం కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్ట్రెచర్ను తాడుతో లాగుతుండగా.. వెల్డింగ్ లోహం వల్ల కార్మికుల శరీరాలకు ఎటువంటి గాయాలు కాకుండా నిరోధించడానికి ప్రతి కార్మికుడు స్ట్రెచర్పై పడుకునేలా చేస్తామని అధికారులు తెలిపారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. గురువారం రాత్రే ఆపరేషన్ పూర్తి కావాల్సింది. కానీ, ఊహించని ఆటంకంతో జాప్యం జరిగింది.
కాగా, లోపల ఉన్న కార్మికులు ఒత్తిడిని అధిగమించేందుకు లూడో, చెస్ వంటి బోర్డ్ గేమ్స్ అందివ్వనున్నట్లు రెస్యూ బృందంలోని మానసిక వైద్యుడు డాక్టర్ రోహిత్ గోండ్వాల్ తెలిపారు. ‘సొరంగంలో చిక్కుకున్న కార్మికులు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేస్తున్నట్లు మాతో చెప్పారు. దాంతోపాటు వారికి కొన్ని బోర్డ్ గేమ్స్ కూడా పంపిస్తాం’’ అని డాక్టర్ గోండ్వాల్ వివరించారు.
కార్మికులను ఒక్కొక్కరుగా బయటకు వచ్చేలా చేసే ఎంపికను కూడా పరిగణించారు. అయినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి, సొరంగం శిధిలాల కింద చీకట్లో ఆహారం లేకుండా 13 రోజులు ఉండటం వంటివి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ ఆప్షన్ను పక్కనబెట్టారు. కాగా, సొరంగంలో చిక్కుకున్న కార్మికులు మంగళవారం మొదటిసారిగా బయటకు ప్రపంచానికి కనిపించారు. పైపు ద్వారా చొప్పించిన కెమెరా వారి దృశ్యాలను బంధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa