కడపలో విద్యార్థిని ఆత్మహత్య కలకలంరేపింది. కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్నగర్కు చెందిన ప్రభుత్వ వసతిగృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న అల్లూరి సుమలతకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. భర్తతో విభేదాలతో ఆమె పిల్లలతో కలసి ఉంటోంది.. భర్త ఆమెకు దూరంగా ఉంటున్నాడు. కుమార్తె కెజియా పాతబస్టాండు సమీపంలోని ప్రభుత్వ బాలిక జూనియర్ కాలేజీలో ఇంటర్ తెలుగు మీడియంలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ బీకాం కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియం చేరింది.
ఆమెకు ఇంగ్లీష్ మీడియం కొత్త కావడంతో పాఠాలు సరిగా అర్థమవడం లేదని ఆమె బాధపడుతుండేది. మంగళవారం తల్లి హాస్టల్కు వెళ్లగా, సోదరులు నిద్రపోతుండగా కెజియా ఇంట్లో ఉన్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. బాధ భరించలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయిది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె తరచూ పాఠాలు సరిగా అర్థం కావడం లేదని తల్లితో చెప్పినట్లు తెలుస్తోంది. క్లాస్లో కూడా తోటి విద్యార్థులందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేదని చెబుతున్నారు. నిదానంగా అర్థమవుతుందిలే అని తల్లి సముదాయించేది.. కానీ ఆ విద్యార్థిని మాత్రం ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. కెజియా ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa