మధ్యప్రదేశ్లో ఓటర్లు కాంగ్రెస్వైపు మొగ్గు చూపినట్టు మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ 117 - 139, బీజేపీ 91-113 , ఇతరులు 0-8 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో అధికారానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 116 సీట్లను కాంగ్రెస్ పొందే అవకాశాలున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 43.1, బీజేపీకి 38.8, ఇతరులు 18.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల వ్యత్యాసం 4.3 శాతంగా ఉందని చెప్పింది.
పోరు హోరాహోరీగా సాగిన చివరిలో బీజేపీపై కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టు వివరించింది. బుందేల్ఖండ్, మహా కౌషల్, వింధ్య ప్రాంతాల్లో బీజేపీకి, చంబల్, ఉత్తర మాల్వా, మాల్వా-తిమార్-నిమార్ ప్రాంతాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, మధ్య భారత్ ప్రాంతంలో రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయని పీపుల్స్ సర్వే అంచనా వేసింది. ఈ ప్రాంతాలలోని ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ 79-97 శాతం ఓట్లు సాధించవచ్చని తెలిపింది. 18 శాతమున్న అగ్రవర్ణాలు కాంగ్రెస్ కంటే బీజేపీకి 3.8 శాతం ఎక్కువ అనుకూలంగా ఉన్నారు. ఓబీసీలలో రెండు పార్టీలకు ప్రాధాన్యత లభించింది. కానీ, ఎస్సీ, ఎస్టీలలో కాంగ్రెస్కు లభించిన భారీ ఆధిక్యత ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలిపింది.
పోల్స్ట్రాట్: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-108, ఇతరులు 0-4 స్థానాలు
జన్ కీ బాత్: కాంగ్రెస్ 102-125, బీజేపీ 100-123, ఇతరులు 0-5 స్థానాలు
టీవీ 9 భరత్ వర్ష: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-116, ఇతరులు 0-6 స్థానాలు
రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 97-107, బీజేపీ, 118-130, ఇతరులు 0-2 స్థానాలు
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 117- 139, బీజేపీ 91- 113, ఇతరులు 0-8
టైమ్స్ నౌ: కాంగ్రెస్ 109-125, బీజేపీ 105-117, ఇతరులు 1-5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa