టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. మిచౌగ్ తుఫాన్ ప్రభావంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో పాదయాత్రకు మూడు రోజులు (బుధవారం వరకు) విరామం ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు యువగళం పాదయాత్ర చేరింది. తుఫాన్ కారణంగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అందుకే పాదయాత్రకు బ్రేక్ పడింది. తుఫాన్ ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించనున్నారు.
తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు లోకేష్. తుఫాన్ బాధితులకు పార్టీ కేడర్.. నేతలకు ఆసరాగా నిలవాలని ఆదేశించారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని... ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ ఉంచుకోవాలని చెప్పారు. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ప్రజలకు అండగా నిలవాలని.. అవసరమైన సమయంలో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దన్నారు. లోకేష్ పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి అమరావతికి బయల్దేరి వెళ్లారు. మళ్లీ బుధవారం అక్కడికి చేరుకుని పాదయాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి యువగళం పాదయాత్ర శీలంవారిపాకలు జంక్షన్ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు..
ఉదయం
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.
11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో భేటీ
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం ఇలా
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – ఒంటి మామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో భేటీ
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa