టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వీరిద్ధరి భేటీ జరిగింది. ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ - జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవంబర్ నాలుగో తేదీన భేటీ అయ్యారు. తరచూ సమావేశమై ఉమ్మడి మ్యానిఫెస్టో సహా పొత్తు ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పలు కారణాలతో ఈ భేటీ ఆలస్యమైంది. ఈ క్రమంలోనే బుధవారం భేటీయైన ఇరువురు నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టో మీద చర్చించినట్లు సమాచారం.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని టీడీపీ, జనసేన గతంలో నిర్ణయించాయి. రాజమండ్రి సెంట్రల్ జైళ్లో చంద్రబాబును పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తు మీద ప్రకటన చేశారు. ఆ తర్వాత ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనకు రెండు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో కోసం కమిటీని సైతం ఏర్పాటు చేశారు.ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో టీడీపీ ఆరు అంశాలను ప్రతిపాదించింది. ఇక జనసేన ఐదు అంశాలను ప్రతిపాదించగా.. 11 అంశాలతో మినీ మ్యానిఫెస్టో రూపొందించారు. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి మ్యానిఫెస్టో రూపొందించాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నవంబర్ నాలుగో తేదీన ఉమ్మడి మ్యానిఫెస్టో అంశం మీద ఇరువురు నేతలు చర్చించారు. ఆ మీటింగ్లోనే తరచూ సమావేశం కావాలని నిర్ణయించుకున్న ఇరువురు నేతలు.. బుధవారం మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా మ్యానిఫెస్టోలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపైనా చర్చలు జరిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై పెద్దఎత్తున పోరాడాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశం భేటీలో చర్చకు రాగా.. ఢిల్లీ స్థాయిలో పోరాడాలని నిర్ణయించినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa