విజయనగరం జిల్లాలోని బూర్జవలస పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు పోల ఎర్రన్నాయుడుకు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయాధికారి కల్యాణ్ చక్రవర్తి బుధ వారం తీర్పు వెలువరించినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. దత్తిరాజేరు మండలం విజయరామపురం గ్రామానికి చెందిన పెద్దింటి తౌడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఈశ్వరమ్మకు సుమారు 24 ఏళ్ల క్రితం తెంటు సింహాద్రితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. రెండేళ్ల తరువాత అల్లుడు సింహాద్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఈశ్వరమ్మ తల్లి వద్దనే ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన కోలా ఎర్రన్నాయుడుతో సన్నిహితంగా ఉంటోంది. ఎర్ర న్నాయుడు ఏ పనీ లేకుండా ఉండేవాడు. దీంతో వీరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఈశ్వరమ్మ వద్దకు వెళ్లి చేయూత పథకం దరఖాస్తు చేసేందుకు కాగితాలు కావాలని ఆయన కోరాడు. దీనికి ఆమె వ్యతిరేకించింది. దీంతో ఇద్ద రూ గొడవపడ్డారు. ఈశ్వరమ్మ తలపై సుత్తితో మోదగా... తీవ్ర గాయాల య్యా యి. కేజీ హెచ్లో చికిత్స పొందుతూ 2022 ఆగస్టు 17న మృతి చెందింది. తల్లి తౌడమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి బూర్జవలస ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చే శారు. సీఐ అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టు లో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. నేరం రుజువు కావటంతో ఎర్రన్నా యుడుకు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa