విశాఖ భార్యను కిరాతకంగా హింసించి ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ,రూ 2వేల జరిమానా విధిస్తూ మహిళా కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి లాలం శ్రీధర్ మంగళవారం తీర్పునిచ్చారు.ప్రకాశం జిల్లా రౌతుపల్లి గ్రామానికి చెందిన ఎస్.రవి,రౌతుపల్లి ప్రాంతానికి చెందిన మార్తమ్మతో 2005 లో అతనికి వివాహమైంది.
పెళ్ళైన కొంతకాలం తర్వాత రవి భార్యను అదనపు కట్నం కోసం హింసించేవాడూ.నిత్యం మద్యం తాగి వచ్చి 2008 మర్చి 29న భార్య తో ఘర్షణ పడ్డాడు.భర్త ప్రవర్తనతో విసుగుచెందిన మార్తమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa