ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఈ దత్తపుత్రుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే... తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీ పెట్టాడు. ఆ సమయంలో అతడు అన్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ మనిషి అంటాడూ... తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నాడట. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అని కూడా అంటాడు. తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి డైలాగులు వేసిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్...చంద్రబాబు నాయుడు పార్టనర్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులపై ఇన్ని డైలాగులు మాట్లాడిన ఆ పెద్దమనిషికి తెలంగాణలో సోదరి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదుఅని తెలిపారు. దత్తపుత్రుడు ప్రతిపాదించిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు అని అన్నారు. అతనికి చంద్రబాబు ప్రయోజనాలే తప్ప ఏపీ ప్రజలపై ప్రేమ లేదు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa