ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ల జాబితా పై చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 02:31 PM

 ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఏకపక్షంగా తొలగించిన వ్యవహారంపై అనంతపురం జిల్లాలో ఏడుగురు తహసీల్దార్లు, 230 మంది బీఎల్వోలకు కలెక్టర్‌ గౌతమి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలపై ఇప్పటికే ఇద్దరు ఏఈఆర్వోలను సస్పెండ్‌ చేశారు. తాజాగా అదే నియోజకవర్గంలో తప్పులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు, బీఎల్వోలకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఒకరిద్దరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా మినహాయించాలని జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారి ఎన్నికల సంఘానికి ప్రతిపాదన చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎన్నికల సంఘం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఓటు తొలగించినా చర్యలు తప్పవని స్పష్టం చేసినట్టు తెలిసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa