కొలినొప్పితో బాధపడుతోన్న తమ పాపను ఓ దళిత కుటుంబం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్తే.. అక్కడి నర్సు ఆ బాలిక పట్ట దారుణంగా వ్యవహరించింది. ఆ బాలికను చేయి పట్టుకుని చూడకుండా కాలితో తొక్కి పరీక్షించింది. దీంతో ఆ పాపను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆమె తాత నిర్ఘాంతపోయాడు. విస్మయానికి గురిచేసే ఈ ఘటన డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు అనే వ్యక్తి.. కాలి నొప్పితో బాధపడుతున్న తన మనవరాలు గుత్తాల శ్రీదేవి (10) ఆదివారం ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.
అక్కడ విధుల్లో ఉన్న నర్సు మణికుమారి.. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. ఎటువంటి చికిత్స చేయకుండానే అమలాపురంలోని పెద్దా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించింది. ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాప తాతయ్య భాస్కరరావు.. రోగులతో వ్యవహరించే తీరు ఇదేనా అని నిలదీశారు. ఆసుపత్రికి వచ్చేవారిని చిన్నచూపు చూడొద్దని ఆయన హితవు పలికారు. అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో నర్సు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ లిఖిత స్పందించారు. ఆమె డిప్యుటేషన్పై ఇక్కడ పనిచేస్తోందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa