కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన సన్ రే రిసార్ట్కు చంద్రబాబు బయలుదేరారు. చంద్రబాబు నాయుడు వెంట నందమూరి బాలకృష్ణ, కంభంపాటి రామ్మోహన్, నారాయణ, నారా రోహిత్ ఉన్నారు. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు చంద్రబాబు చేరుకోనున్నారు. తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఓకే వేదికపై కనిపించబోతున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత అధినేతలు ఇద్దరూ ఒకే వేదికపై నుంచి మాట్లాడబోతున్నారు. ఈ సభ పట్ల ఏపీ వ్యాప్తంగా ఇరు పక్షాల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్ కార్యాచరణను యువగళం వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. కాగా.. నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో జనసేనాని విశాఖ వెళ్లనున్నారు. ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ కనిపించనుండటంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు టీడీపీ, జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa