ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలోని ఇజ్రాయేల్ ఎంబీసీ వద్ద భారీ శబ్దంతో పేలుడు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 10:27 PM

దేశ రాజధాని ఢిల్లీలోని కలకలం రేగింది. ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద మంగళవారం సాయంత్రం భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎంబసీ ఆవరణలో తనిఖీలు నిర్వహించినా.. ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు. దాదాపు సాయంత్రం 5 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించినట్టు ఇజ్రాయేల్ ఎంబసీ అధికార ప్రతినిధి తెలిపారు. పేలుడు స్వభావం గురించి మరింత తెలిసిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


దౌత్యకార్యాలయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, కేసు దర్యాప్తు చేసేందుకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నామని ఇజ్రాయేల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాపై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీ వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబరు 23న పాలస్తీనా పౌరులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది. అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌లోని బిహార్‌, కోల్‌కత్తాలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. మార్చ్ నిర్వహించి, ఇజ్రాయేల్ జెండాలను తగలబెట్టారు. కోల్‌కత్తాలోనూ ఇలాంటి నిరసనలే జరిగాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa