ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ ఆశీస్సులతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యా... వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: వైసీపీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 07:38 PM

వచ్చే ఎన్నికల్లో పోటీ, పార్టీ మారుతారంటూ మీడియాలో జరుగుతోన్న ప్రచారం సహా పలు అంశాలపై గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టత ఇచ్చారు. బుధవారం ఆయన మార్కాపురంలోని తమ నివాసంలో అన్నా రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యే అన్నా ప్రకటించారు.


వైఎస్సార్సీపీనే కొనసాగుతానని, తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన తెలిపారు. కావాలనే కొందరు తనపై దుస్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాంబాబు మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటి సారి నేను ఎమ్మెల్యే అయ్యానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే . తనను, తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు,డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదని అన్నారు.


జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టి పట్టనట్లు ఉన్నారని, 2024లో తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పా కానీ ఆయన ఒప్పుకోలేదని పేర్కొన్నారు. జగన్‌తోనే తన రాజకీయ ప్రయాణం అని అన్నా రాంబాబు కుండబద్దలు కొట్టారు. ఇటివల నేను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లా లోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లానని ఆయన చెప్పారు. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని సైతం దూషించారని వాపోయారు. కాగా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసిన ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఎమ్మెల్యేగా కొనసాగి 2014లో టీడీపీలో చేరారు. తర్వాత టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa