విజయవాడ నగరంలో నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనాన్ని జనవరి 19వ తేదీన ప్రారంభిస్తామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, విగ్రహావిష్కరణపై అందరి సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా దళితులకు మంచి గౌరవం దక్కిందన్నారు. జగనన్న నాయకత్వంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎక్కడ నుంచి పోటీచేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఎవరికి ఎలా న్యాయం చేయాలో తెలుసని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa