తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో చనిపోయినవారి సంఖ్య 5,33,366కి పెరిగింది. కాగా.. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,76,550గా ఉంది.
మరోవైపు దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రకం వేరియంట్ వ్యాప్తి దేశంలో వేగంగా ఉందనీ.. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం కూడా దేశంలో 196 జేఎన్-1 రకం కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలో 83, గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢిల్లీ (1) ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని.. ఇక కరోనా వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa