ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ జీవితమంతా అబద్దాలతో నిండిపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 03:14 PM

 రూ.3వేలు పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే మాట తప్పారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కారన్నారు. మాట తప్పి మడమ తిప్పి ఒక్కొక్కరికీ రూ.30వేలు ఎగనామం పెట్టారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలోనూ పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రూ.200 పెన్షన్ రూ.1800 పెంచి రూ.2000 చేశారని అన్నారు. చంద్రన్న ఐదేళ్లలో కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారని చెప్పారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో పెంచింది రూ.750 మాత్రమే, లబ్ధిదారులు 10 లక్షలు మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు రూ.7లక్షల కోట్ల బడ్జెట్లో 20 లక్షల కొత్త పెన్షన్లిచ్చారన్నారు. రూ.12లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న జగన్‌రెడ్డి ఇచ్చిందెంత అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి జగన్‌రెడ్డి అబద్దాలను నమ్ముకున్నారని మండిపడ్డారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa