ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొత్తులపై కేంద్రానిదే తుది నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 03:22 PM

 ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగా చూడాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్  తెలిపారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలపై లంకా దినకర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.  ఆయన మాట్లాడుతూ... ఏపీలో పొత్తులు, సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాటలకు, రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం కరెక్టు కాదని అన్నారు. కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నాయకులు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా ఏదైనా పొత్తులపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతమని భావించాలని తెలిపారు. ఏపీలో పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించినట్లు చెప్పారు. పెద్దల ఆదేశాలుంటే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి త్వరలో ప్రకటిస్తారని లంకా దినకర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa