తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా వాహనం టైర్ పంచర్ కావడంతో.. రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలోని 11 మందికి గాయాలు కాగా... ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 19 నెలల చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎర్టిగా కారు.. దేవరపల్లి సమీపంలోని బంధపురం వద్దకు రాగానే టైరు పేలి.. డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం పక్క మార్గంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు కార్లలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో ఏడుగురు ఉండగా.. వారిలో సుభాష్ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
రెండు వాహనాల్లోని మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. డివైడర్ పైకి ఎక్కి.. అవతలివైపు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన దృశ్యం యాక్షన్ సినిమాలోని సన్నివేశాన్ని తలపిస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో బీతావాహ పరిస్థితులు నెలకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa