ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యక్రమాల ప్రక్రియను పర్యవేక్షించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. ఇండియా కూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షించేందుకు వీరి నియామకాన్ని చేపట్టింది. ఈ సమన్వయకర్తలు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి అందించి అక్కడినుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తారు.
ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. 1.అరకు-జగత శ్రీనివాస్ 2. శ్రీకాకుళం-మీసాల సుబ్బన్న 3. విజయనగరం-బొడ్డేపల్లి సత్యవతి 4. విశాఖపట్నం-కొత్తూరి శ్రీనివాస్ 5. అనకాపల్లి-సనపల అన్నాజీరావు 6. కాకినాడ-కేబీఆర్ నాయుడు 7. అమలాపురం- ఎం.వెంకట శివప్రసాద్ 8. రాజమహేంద్రవరం- ముషిని రామకృష్ణ 9. నరసాపురం- జెట్టి గురునాథరావు 10. ఏలూరు- కె.బాపిరాజు 11. మచిలీపట్నం- కొరివి వినయ్కుమార్ 12. విజయవాడ- డి.మురళీమోహన్ రావు 13. గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్
14. నరసరావుపేట- వి.గురునాథం 15. బాపట్ల- శ్రీపతి ప్రకాశం 16. ఒంగోలు- యు.వెంకటరావ్ యాదవ్ 17. నంద్యాల- బండి జకారియా 18. కర్నూలు- పీఎం కమలమ్మ 19. అనంతపురం- ఎన్.శ్రీహరి ప్రసాద్ 20. హిందూపురం- షేక్ సత్తార్ 21. కడప- ఎం.సుధాకర్బాబు 22. నెల్లూరు- ఎం.రాజేశ్వరరావు 23. తిరుపతి- షేక్ నజీర్ అహ్మద్ 24. రాజంపేట- ఎన్.తులసిరెడ్డి, 25. చిత్తూరు- డి.రాంభూపాల్రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల.. వైఎస్సార్టీపీని కూడా హస్తం పార్టీలో విలీనం చేశారు. అయితే షర్మిలకు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. తనకు ఏ బాధ్యతలు అప్పగించిన స్వీకరించేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజా పరిణామాలను బట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa