టీడీపీ-జనసేన సభను విజయవంతం చేద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలంటే నారా చంద్రబాబునాయుడు ఒక్కడితోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా, వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి లో మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు నకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భూ కబ్జాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు పెట్రేగిపోయాయని మళ్లీ వైసీపీకి అవకాశం ఇస్తే అరాచకాలకు అడ్డు ఉండదని ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన కలయికలో రాబోవు ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని గుర్తు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవనకళ్యాణ్ ఈనెల 24న పీలేరుకు రానున్న సందర్భంగా ప్రతి గ్రామం నుంచి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి సభను విజయవంతం చేయా లని కిశోర్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని గ్రామాల వారీ నాయకులు, కార్యకర్తలు, బూత కన్వీనర్లతో చర్చించి సూచనలు చేశారు. అంతకు ముందుగా పార్టీల నాయకులు, కార్య కర్తలు నల్లారిని గజమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్, జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు పీవీ నారా యణ, పులి సత్యారెడ్డి, చంద్రమౌళి, శేషాద్రిరెడ్డి, కాంతరాజు, సుధాకర్ రెడ్డి, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, కేవీ రెడ్డి, భాస్కర్రెడ్డి, డిష్ బ్రదర్స్, కువైట్ సయ్యద్బాషా, హరినాథరెడ్డి, రాజేంద్రాచారి, మురళి, సురేష్కుమార్ రెడ్డి, జయకృష్ణ, తదితర నాయకులు, కార్యకర్తలు, సర్పంచలు, మాజీ సర్పంచలు, బూత కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa