నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఉన్నత న్యాయస్థానం చట్టపరమైన రక్షణ కల్పించడంతో సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా శనివారం మధురుపూడి విమానాశ్రయం వద్ద ఆయనకు టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆవ భూముల ఉద్యమ నాయ కుడు అడపా శ్రీనివాస్ భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల అనంతరం సొంత ప్రాంతానికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్బాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు అం దించిన సహకారం తన జీవితంలో మర్చిపోలేనిదన్నారు. ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. మధురపూడి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా భీమవరం పట్టణానికి బయల్దేరిన ఆయనకు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో టీడీపీ నాయకులు మింగి లక్ష్మీనారాయణ, బత్తిన సత్తిబాబు, పలువురు జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa