కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి మరికొద్ది రోజుల్లోనే ప్రియా అట్లూరిని పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. తన కుమారుడి వివాహ రిసెప్షన్కు రావాలని.. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులను షర్మిల ఆహ్వానిస్తున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ను ముందుగా ఆహ్వానించిన షర్మిల.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా అనేక మందిని ఆహ్వానించారు.
అయితే వాళ్లందరికీ షర్మిల ఒక్కరే వెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ నందమూరి ఫ్యామిలీకి చెందిన అలేఖ్యా రెడ్డికి మాత్రం షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కలిసి ఇన్విటేషన్ అందించారు. అలేఖ్యతో కలిసి వారిద్దరూ దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో తమ కొడుకు వివాహ రిసెప్షన్కు ఆహ్వానించడానికే షర్మిల దంపతులు తారకరత్న భార్యను కలిశారనే భావన వ్యక్తం అవుతోంది.
రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను ఆహ్వానించడం కోసం షర్మిల ఒక్కరే వెళ్తున్నారు. కానీ రాజకీయ నేపథ్యం లేని, కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారిని ఆహ్వానించడానికి షర్మిలతోపాటు అనిల్ కూడా వెళ్తున్నారని దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మల్లికార్జున ఖర్గే ఆమె మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె పక్కనే ఉన్న అనిల్కు కూడా ఖర్గే కండువా కప్పబోగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీన్ని బట్టి తనపై రాజకీయ ముద్ర లేకుండా ఉండాలని బ్రదర్ అనిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది.
గత ఏడాది నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య.. వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి మరదలు కుమార్తె. సామాజిక వర్గాలు వేరైనప్పటికీ.. అప్పటికే అలేఖ్యకు పెళ్లయి విడాకులు తీసుకున్నప్పటికీ.. రాజకీయంగానూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహానికి అవేవీ అడ్డు రాలేదు. తారకరత్న భార్య తన కూతురని చెప్పే విజయసాయి రెడ్డి.. తన అల్లుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో బెంగళూరు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, డాక్టర్లతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.
తారకరత్న మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన షర్మిల.. ఆమెను ఓ సోదరిలా ఓదార్చారు. విజయసాయి రెడ్డితోపాటు.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన షర్మిల వారికి ధైర్యం చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 17న జరగనున్న తన కొడుకు పెళ్లి కోసం ఆమెను కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa