గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. తమకు ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనాన్ని పెంచి.. ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ఇటీవల పలు జిల్లాల్లో వాలంటీర్లు నిరసనలు చేసిన వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు నగదు బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాలంటీర్ల అభినందన కార్యక్రమం-2024 పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేసి.. వారిని సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. ఇలా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేయడానికి ప్రభుత్వం.. జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్గా కలెక్టర్ ఉంటారు.
అయితే ఇప్పటికే జగన్ ప్రభుత్వం.. వాలంటీర్లకు ఏటా కొన్ని పురస్కారాలను ఇస్తోంది. ఆ ఏడాదిలో ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందిస్తోంది. ఇవే కాకుండా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో చక్కని పనితీరు కనబరిచిన వాలంటీర్లను గుర్తించి ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలం, పట్టణం, జోనల్, నియోజకవర్గం, జిల్లాకు ఒక వాలంటీర్ చొప్పున జిల్లా స్థాయి కమిటీ ఎంపిక చేయనుంది. వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వాలంటీర్లను సత్కరించనున్నారు. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa