అంగన్వాడీలను విధుల నుంచి తొలగించాంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడు ప్రతాపం చూపిస్తున్నాడని మండిపడ్డారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరిందని మండిపడ్డారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లిందన్నారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగులు, వందలాది అదనపు బలగాలను దించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టీడీపీ - జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa