కర్ణాటకలో బీజేపీ ఎంపీకి చేదు అనుభవం ఎదురయ్యింది. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హాను తమ గ్రామంలోకి ప్రవేశించకుండా దళితులు అడ్డుకున్నారు. మైసూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో పోలీసులు జోక్యంతో ఎంపీ అక్కడ నుంచి వెనుదిరిగారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించే శిలను ఆ గ్రామం నుంచే సేకరించడం గమనార్హం. దశాబ్దకాలంగా తమను నిర్లక్ష్యం చేశారని దళితులు ఆరోపించారు. తమ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.
ఈ ప్రాంతం నుంచి ప్రతాప్ సిన్హా రెండు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. గురించి కించపరిచే ప్రకటనలు చేశారని కూడా ఆరోపించారు. రామమందిర ప్రతిష్ఠ సందర్భంగా ఆ గ్రామంలోని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరైన ఎంపీని దళితులు అడ్డుకున్నారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అక్కడ నుంచి పోలీసుల సహకారంతో ఎంపీ వెనుదిరిగారు. ఈ సమయంలో బీజేపీకి మిత్రపక్షమైన జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ కూడా ఉన్నారు.
గుంపులోని ఒక వ్యక్తి ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఎంపీతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడివారు అతడ్ని ఒకానొక సమయంలో పట్టుకుని దూరంగా లాగాల్సి వచ్చింది. అయినా సరే అతడు తగ్గకపోగా.. ఎంపీ, ఆయన అనుచరులతో ఘర్షణకు ప్రయత్నించాడు. ‘మీరు మాకు ఏమీ చేయలేదు. మేము అన్నీ చేశాం... మేము కూడా రాముడిని గౌరవిస్తాం.. దయచేసి బయటకు వెళ్లండి’ అని ఎంపీపై విరుచుకుపడ్డాడు. రెండు నిముషాల పాటు వాదనలు కొనసాగడంతో ఇరుపక్షాల మధ్య ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎంపీ.. తనచేతి పైకిలేపడం వీడియోలో కనిపిస్తుంది. దాదాపు 150 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహిళా పోలీసు అధికారి జోక్యం చేసుకుని సింహాను అతని వాహనంలోకి తీసుకెళ్లే ముందు అతనిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa