ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడి ఫోటోలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 09:42 PM

 కోట్లాది మంది హిందువుల కోరిక నెరవేరేలా అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవం పూర్తి చేసుకుంది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఆ తర్వాత విడుదలైన బాల రాముడి ఫోటోలను చూసి భక్తులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి.. చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. 5 ఏళ్ల వయసు ఉన్న బాలుడి రూపంలో నిండైన ముఖంతో అమాయకంగా చిరు నవ్వుతో ఉన్న బాల రాముడిని చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa