నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘గత కొద్ది రోజులుగా నా సీటు విషయంలో అనిశ్చితి నెలకొంది. నాయకులు, ప్రజలు, కేడర్ గందరగోళంలో పడిపోయారు. దీనివల్ల నాయకులకు, పార్టీకి, నాకూ ఎవరికీ ఉపయోగం లేదు. వీటన్నిటికీ తెరదించేందుకే వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా..’ అని ప్రకటించారు. పల్నాడు నుంచి భారీ సంఖ్యలో ఆయన వద్దకు వచ్చిన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అక్కడే రాజీనామాలను ప్రకటించడం గమనార్హం. లావు త్వరలో టీడీపీలో చేరతారని.. నరసరావుపేట నుంచే లోక్సభకు పోటీచేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa