టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఉదయం 10.10 గంటలకు బిక్కవోలు గ్రామం.. 12.30 గంటలకు నిడదవోలు మండలం పందలపర్రు గ్రామం.. 1.10 గంటలకు తిమ్మరాజుపాలెం.. 1.55 గంటలకు తాడిమళ్ళ గ్రామం.. సాయంత్రం 4.30 గంటలకు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, కాటానగరం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. అనంతరం నారా భువనేశ్వరి సాయంత్రం 5.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa