టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం ఈ నెల 28న పత్తికొండలో ఉంటుందని ఆపార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కేఈ శ్యాంబాబు తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. చంద్రబాబు చేపట్టిన ‘రా కదలిరా’ పర్యటన 25వతేదీ పత్తికొండలో జరగాల్సిఉండగా అనివార్యకారణాలవల్ల వాయిదా పడిందన్నారు. పార్టీకార్యాలయం నూతనషెడ్యూల్లో 28వతేదిన పత్తికొండలో ‘రా కదలిరా’ కార్యక్రమం విడుదలకు షెడ్యూల్ ఖరారు చేసిం దన్నారు. ‘రా కదలిరా’ కార్యక్రమానికి సంబంధించి బహిరంగసభ నిర్వహ ణకు ఆదోని రహదారిలో పెట్రోల్బంక్ పక్కన స్థలాన్ని ఎంపిక చేయడం చేసినట్లు తెలిపారు. ‘రా కదలిరా’ కార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులు స్థలపరిశీలనచేసి బహిరంగసభ నిర్వహణ, హెలిపాడ్ ఏర్పాటుకు సంబం ధించి రూట్మ్యాప్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa