ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. ఏప్రిల్ వరకు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 06:12 PM

తిరుమల వెళ్లే భక్తులకు మరో గుడ్‌న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ తెలిపారు. ముఖ్యంగా తిరుపతికి వెళ్లే రైళ్లను కూడా పొడిగించారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు పూర్ణా–తిరుపతి (07609), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–పూర్ణా (07610).. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632) రైళ్లను పొడిగించారు.


అలాగే ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–సికింద్రాబాద్‌ (07481).. ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 1 వరకు సికింద్రాబాద్‌–తిరుపతి (07482).. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29 వరకు కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07445).. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (07446) రైళ్లును పొడిగించి నడపనున్నట్లు తెలిపారు. తిరుపతికి పొడిగించిన రైళ్లతో తిరుమలకు వెళ్లే భక్తులకు ఉపయోగంగా ఉంటుందని రైల్వేశాఖ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa