నేటి నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ‘రా కదలి రా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వరుసగా 3 రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు పీలేరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు తిరుపతి చేరుకోనున్నారు. ఇక తిరుపతి నుంచి హెలికాప్టర్లో పీలేరు మండలంలోని వేపులబయలుకు చంద్రబాబు వెళ్లనున్నారు. వేపులబయలు బహిరంగ సభలో ప్రసంగిoచనున్నారు. అనంతరం సాయంత్రం ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు (28న) నెల్లూరు రూరల్, పత్తికొండల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో జరగనున్న సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ‘రా.. కదలిరా!’ అన్న పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa