ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కోసం రిటైర్డ్ హెడ్‌మాస్టర్ పెద్ద మనసు.. వద్దని పంపించేసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 09:43 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు పీ వెంకట రమణ జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌‌ను మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్‌ కళ్యాణ్‌ భావజాలానికి ఆకర్షితులైన వెంకట రమణ తనకు వచ్చే ఒక నెల పింఛన్‌ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డీడీని తీసుకొచ్చారు. ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు.


పవన్ కళ్యాణ్ వెంకట రమణతో సంభాషించి కుటుంబ వివరాలు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం గురించీ తెలుసుకున్నారు. వెంకట రమణ పట్టుబట్టడంతో రూ. 10 విరాళంగా తీసుకొని ఆయనను పవన్‌ కళ్యాణ్‌ గుండెలకు హత్తుకున్నారు. 'నా నెల పెన్షన్ పార్టీకి విరాళంగా ఇద్దామని వస్తె, ఇంటిపెద్దగా ఉన్న నేను మొత్తం విరాళంగా ఇస్తే కుటుంబం ఇబ్బంది పడుతుంది అని 10రూపాయలు మాత్రమే తీసుకున్నారు, అలాంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పెద్దమనిషిగా ఉండాలి అని కోరుతున్నాను' అన్నారు. వెంకటరమణ కుప్పం నియోజకవర్గంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు.


మరోవైపు అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ లక్ష్మీపతికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. ఆయనతోపాటు అంబరపు వెన్నెలకృష్ణు శ్రీ జి.మధుసూదన్‌ పార్టీలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa